ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి పిరికిపంద చర్య.. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ
◆ దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక, టీడీపీ ఓటమి భయంతో దాడికి పాల్పడటం పిరికిపంద చర్య అని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం.శంకర్ నారాయణ విమర్శించారు.
బుక్కరాయసముద్రం మండలం బొమ్మలపల్లి గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో వీరాంజనేయులు, శంకర్ నారాయణ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
వారు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో ప్రతిపక్షాలు ఓటమి భయంతో ఈ ఘాతుకానికి పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పై జరిగిన ఈ దాడి ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్రగా భావిస్తున్నామన్నారు. టిడిపి జనసేన ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం ఖాయమని, టిడిపిని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 15 2024, 07:11